- Advertisement -
హైదరాబాద్: నిషేధిత గుట్కా ప్యాకెట్లు, టొబాకో ప్యాకెట్లను నగర సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. గుట్కా విక్రయిస్తున్న నిందితుడి వద్ద నుంచి రూ.2లక్షల విలువైన గుట్కా, టొబాకో వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని భవానీనగర్కు చెందిన ఎండి అబ్దుల్ రిజ్వాన్ నిషేధిత గుట్కా ప్యాకెట్లు,టొబాకో చూయింగ్గమ్ ప్యాకెట్లను ఓ ఇంట్లో నిల్వ చేసి విక్రయిస్తున్నారు. ప్రభుత్వం నిషేధించిన టొబాకో వస్తువులను విక్రయిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇంటిపై దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. టాస్ఫోర్స్ ఓఎస్డి రాధాకిషన్ రావు పర్యవేక్షణలో ఇన్స్స్పెక్టర్ రాఘవేంద్ర తదితరులు దాడులు చేసి నిందితులను పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం భవానీనగర్ పోలీసులకు అప్పగించారు.
police seize banned gutka in Hyderabad
- Advertisement -