Tuesday, April 23, 2024

పసికందును తొక్కి చంపిన పోలీసులు?… విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: పసికందును పోలీసులు తొక్కి చంపారని ఆరోపణలు వచ్చిన సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రం గిరిద్హా జిల్లాలో జరిగింది. ఈ కేసును దర్యాప్తు చేయాలని ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హెమంత్ సోరెన్ పోలీసులను ఆదేశించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కోసోగోండోడిఘి గ్రామంలో ఓ కేసులో నిందితుడు భూషణ్ పాండేను పట్టుకోవడానికి పోలీసులు ఓ ఇంట్లోకి వెళ్లారు. ఇల్లు మొత్తం సోదాలు చేసిన నిందితుడి ఆచూకీ మాత్రం లభించలేదు. ఆ ఇంట్లో ఒక తల్లి నాలుగు రోజుల వయసు కలిగిన పసికందుతో కలిసి ఉంటుంది.

పోలీసులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వెంటనే నవజాత శిశువు తల్లి ఎత్తుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఉలుకుపలుకు లేకపోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పసికందు మృతి చెందిందని పరీక్షించిన వైద్యుడు తెలిపాడు. పోలీసులు తొక్కి చంపడంతో శిశువు మృతి చెందిన కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. పోలీసులే తొక్కి చంపారని ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దర్యాప్తు చేయాలని స్థానిక ఎస్‌పి సంజయ్ రానాకు ఆదేశించారు. శిశువు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ మంత్రి బన్నగుప్తా తెలిపారు. అందరూ రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలని, ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని శిక్షిస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News