- Advertisement -
మనతెలంగాణ, హైదరాబాద్ : పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను సకాలంలో ఆస్పత్రిలో చేర్పించి ఆదుకున్నారు సుల్తాన్బజార్ పోలీసులు. నగరంలోని బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్, కెఎస్లైన్కు చెందిన కృష్ణప్రియ రాత్రి 11.15 గంటలకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే డయల్ 100కు ఫోన్ చేయడంతో సుల్తాన్బజార్ పోలీస్ స్టేషన్కు చెందిన పెట్రోలింగ్ సిబ్బంది కళ్యాన్, సాయి, వినోద్ అక్కడికి చేరుకుని గర్భిణిని వెంటనే ఆస్పత్రలో చేర్పించారు. గర్భినిని సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్పించిన సిబ్బందిని పైస్థాయి అధికారులు అభినందించారు.
Police who took Pregnant Woman to Hospital
- Advertisement -