Friday, March 29, 2024

ఓటు హక్కు వినియోగించుకున్న ఇంద్రకరణ్, జోగు, విట్టల్

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్:  అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలికల పాఠశాలలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో  ఎమ్మెల్సీ అభ్యర్థి దండే విట్టల్, జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతుంది. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీదే విజయమని సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో దండే విఠల్ భారీ మెజార్టీతో గెలుస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ లో ఎమ్మెల్యే జోగు రామన్న ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News