Thursday, March 28, 2024

కొనసాగుతున్న సహకార సంఘాల ఎన్నికలు…

- Advertisement -
- Advertisement -

Polling

హైదరాబాద్: తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. మధ్యాహ్నం 2గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తారు. రాష్ట్రంలో 747 పిఎసిఎస్ ల పరిధిలోని 6,248 డైరెక్టర్ పోస్టులకు ఎన్నికలు జరుగుతుండగా…. ఇప్పటికే 157 సొసైటీలు ఏకగ్రీవం అయ్యాయి.

ఈ ఎన్నికల్లో సూమారు 12 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ మేరకు పోలింగ్‌కు అవసరమైన అన్ని చోట్ల అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. ఫలితాలు వచ్చిన మూడు రోజుల తర్వాత పాలకవర్గాల నియామకం చేపట్టనున్నట్లు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ అధికారి సుమిత్ర తెలిపారు. ఈ ఎన్నికలకు సర్కార్ పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేసింది. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఎస్పిలు భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

 

Polling for Cooperative societies begins in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News