Saturday, April 20, 2024

కాంగ్రెస్ వైపు పొంగులేటి, జూపల్లి అడుగులు..!?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. ఆ ఫలితాల తర్వాత మాత్రం కాంగ్రెస్ వైపే పొంగులేటి అడుగులు కూడా పడుతున్నాయని సమాచారం. ఇదే బాటలో జూపల్లి కూడా నడవబోతున్నారని అంటున్నారు. కాంగ్రెస్‌కే జై కొట్టాలని ఇద్దరు నేతల అనుచరులు కూడా పట్టుబడటంతో ఆ మేరకు తుది నిర్ణయానికివచ్చినట్టు సమాచారం. వాస్తవానికి ఇంతకు ముందే ఇద్దరూ కాంగ్రెస్ జెండా కప్పుకోవాలి. ప్రియాంక గాంధీ హైదరాబాద్ పర్యటనలో కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది. అయితే అప్పట్లో బిజెపి నేతలు ఒత్తిడి తీసుకు రావడంతో ఆలోచన వాయిదా పడ్డప్ప టికీ ఇక ఇదే ఫైనల్ డెసిషన్ అంటున్నారని అంటున్నారు. తొలుత కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత జూపల్లి, పొంగులేటి బిజెపిలో చేరాలని డిసైడ్ అయ్యారు.

వారం క్రితం ఖమ్మంలో బిజెపి నేతలు పొంగులేటితో సుదీర్ఘ చర్చల తర్వాత కాంగ్రెస్‌లో చేరాలనుకున్న ఆలోచన విరమించుకుని ఇద్దరూ బిజెపిలో చేరేందుకు చర్చలు జరిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగు లేటి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జూపల్లి ఎవరికి వారే బాగా పట్టున్న నేతలు కావడంతో వారిద్దరినీ పార్టీలో చేర్చుకోవటం వల్ల వచ్చే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బిజెపి నాయకత్వం చాలా ఆఫర్లు ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. అయితే అప్పటికప్పుడు జెండా కప్పుకోకుండా కర్ణాటక ఎన్నికల ఫలితాల వచ్చాక తుది నిర్ణయం తీసుకుంటామని ఈటల బృందానికి పొంగులేటి హామీ ఇచ్చారు. అయితే కర్ణాటక ఫలితాలు బిజెపికి ఎంత షాకిచ్చాయో, పొంగులేటి, జూపల్లికి కూడా అంతే షాకిచ్చాయి. శనివారం ఫలితాలు వెల్లడయ్యాక జూపల్లి, పొంగులేటి ఫోన్లో సుదీర్ఘంగా చర్చించుకున్నారని, బిజెపిలో చేరే అంశాన్ని వాయిదా వేసుకున్నారని అంటున్నారు.

మరోవైపు బిజెపిని ఎలాగైనా నేతలతో నింపేయాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. చేరికల కమిటీకి ఇంచార్జ్ గా ఉన్న ఈటల రాజేందర్ విసుగు పుట్టి రాజీనామాకు కూడా సిద్ధమయ్యారు. అయితే హైకమాండ్ పెద్దలు సర్ది చెప్పారు. కొంత కాలం ఆగాలన్నారు. ఇప్పుడు జోష్ అంతా కాంగ్రెస్‌లోనే కనిపిస్తోంది. కొంత కాలం పాటు బిజెపి ఈ నిరాశలోనే ఉండనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News