Saturday, April 20, 2024

చెలరేగుతున్న పూనమ్.. పీకల్లోతు కష్టాల్లో ఆసీస్

- Advertisement -
- Advertisement -

సిడ్నీ:ఐసిసి మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా జరుగుతున్న తొలి టి20 మ్యాచ్ లో భారత్ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు ఆరు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ బెత్ మూనీ(6) నిరాశ పర్చినా.. మరో ఓపెనర్ అలాసా హీలి(51) అర్థ సెంచరీ మెరిసింది. ఆ వెంటనే పెవిలియన్ చేరింది. ఆ తర్వాత వచ్చిన మెగ్ లానింగ్(5), రాచెల్ హేన్స్(6), ఎలీస్ పెర్రీ(0), జెస్ జోనాసెన్(2)లు వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో 14 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఆష్లీ గార్డనర్(11), అన్నాబెల్ సదర్లాండ్(2)లు ఉన్నారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టగా, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్ తలో వికెట్ తీశారు.

Poonam Yadav dents Australia with 4 wickets

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News