- Advertisement -
హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎంఎల్సి కోటా ఉప ఎన్నిక వాయిదా పడింది. కరోనా వైరస్ నివారణలో భాగంగా లాక్డౌన్ కొనసాగుతున్నందున వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఏప్రిల్ 7వ తేదీన ఎంఎల్సి ఉప ఎన్నికకు జరగాల్సిన పోలింగ్కు సంబంధించి తేదీని మళ్లీ షెడ్యూల్ చేయనున్నట్లు ఇసి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికల సంఘం ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలు కూడా వాయిదా వేసిన విషయం విధితమే. ఎంఎల్సి ఉప ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ ఈ నెల 23వ తేదీన ముగిసింది. ముగ్గురు అభ్యర్థులు సుభాష్రెడ్డి, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత, బిజెపి అభ్యర్థిగా పోతన్కర్ లక్ష్మీనారాయణ బరిలో నిలిచారు.
Postponed the MLC by-election
- Advertisement -