Wednesday, April 24, 2024

పవర్ ఉన్నవారి కంటే ప్రజల పవర్ ఎప్పటికీ శక్తివంతమైనదే

- Advertisement -
- Advertisement -
Power of people greater than people in power Says KTR
వ్యవసాయ చట్టాల రద్దుపై స్పందించిన కెటిఆర్

హైదరాబాద్: వ్యవసాయ చట్టాల రద్దుపై రాష్ట్ర ఐటి మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అధికారంలో ఉన్నవారి పవర్ కంటే ప్రజల పవర్ చాలా శక్తివంతమైనదని కెటిఆర్ పేర్కొన్నారు. ఇది మరోసారి నిరూపితమయ్యింది అన్నారు. ‘పవర్ ఉన్నవారి కంటే ‘ప్రజల పవర్ ఎప్పటికీ శక్తివంతమైనదే’ భారత రైతులు దీనిని నిరంత ఆందోళనతో తాము అనుకున్నది సాధించి నిరూపించారు. ‘జై జవాన్.. జై కిసాన్’ అని కెటిఆర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ఉదయం సంచలన ప్రకటన చేశారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు రాజ్యాంగబద్దమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన సంగతి విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News