టాలీవుడ్లో స్టార్లు చాలామందే ఉన్నారు కానీ వారందరిలో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా పేరు తెచ్చుకున్నాడు. ఈ యంగ్ రెబల్స్టార్ తాజాగా మరో ఘనత సాధించాడు. ప్రభాస్ ఫేస్బుక్ పేజికి ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లు దాటింది. సౌత్ ఇండియా మొత్తం మీద ఇంత ఫాలోయింగ్ ఉన్న హీరో అతను ఒక్కడే. ఇతర తెలుగు స్టార్ హీరోల్లో ఫేస్ బుక్ ఫాలోయర్ల సంఖ్య అల్లు అర్జున్కి 13.1 మిలియన్లు, మహేష్ బాబుకి 7.97 మిలియన్లు, రామ్ చరణ్కి 7.1 మిలియన్లు, నానీకి 5.2 మిలియన్లు ఉండడం విశేషం. ‘బాహుబలి’ రెండు భాగాలు ఘన విజయం సాధించిన తర్వాత ప్రభాస్ క్రేజ్ భారీగా పెరిగింది. ‘సాహో’ చిత్రంతో అతను పాన్ ఇండియా స్టార్గా ఎంతో పాపులారిటీ సంపాదించాడు. ఇక ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ పీరియడ్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు.