యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ్ తదితర భాషల్లో రూపొందించడమే కాకుండా ఇంగ్లీష్లో డబ్ చేసి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిసింది. నాగ్ అశ్విన్ ఇప్పటికే ఈ సినిమా కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ ను ఎంపిక చేయడం జరిగింది. ఇంకా ఈ చిత్రం కోసం ‘అవెంజర్స్’ కోసం పని చేసిన కొందరు టెక్నీషియన్స్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలిసింది.
విజుల్ ఎఫెక్ట్తో పాటు ఇంకా చిత్రానికి సంబంధించిన సౌండ్ ఎఫెక్ట్ను కూడా హాలీవుడ్ రేంజ్లోనే నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నాడట. ఇక ప్రభాస్కు ‘బాహుబలి’ చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. ఇప్పటికే ఆయన తదుపరి చిత్రాలపై బాలీవుడ్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. అలాంటిది ఈసారి ఏకంగా పాన్ ఇండియా మూవీతో వరల్డ్నే ప్రభాస్ టార్గెట్ చేయాలి అంటే మాత్రం హాలీవుడ్ టెక్నీషియన్స్ను ఈ చిత్రం కోసం పని చేయించాల్సిందే అంటున్నారు. ఈ ఏడాది చివరలో షూటింగ్ ప్రారంభించుకునే ఈ చిత్రాన్ని 2022 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.