వరుసగా రెండు బ్లాక్బస్టర్లు కొట్టి అందరి కళ్లలో పడ్డాడు దర్శకుడు వెంకీ కుడుముల. ఛలో,- భీష్మ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లు కొట్టేయడంతో అతడి పేరు టాలీవుడ్లో మార్మోగుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శిష్యుడిగా తనకంటూ ఒక రేంజ్ ఉందని నిరూపించాడు వెంకీ. వరుస బ్లాక్బస్టర్లతో ఫుల్ స్వింగ్లో ఉన్న ఈ యంగ్ డైరెక్టర్ కోసం పలు అగ్ర నిర్మాణ సంస్థలు, అగ్ర కథానాయకులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చేయడం హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ప్రఖ్యాత యువి క్రియేషన్స్ సంస్థ వెంకీ వినిపించిన లైన్కి ఓకే చెప్పిందట. ఆ లైన్ ప్రభాస్కి కూడా నచ్చడంతో ఈ దర్శకుడు పూర్తి స్థాయి స్క్రిప్ట్ను సిద్ధం చేసే పనిలో ఉన్నాడని తెలిసింది. నాగశౌర్యకి ‘ఛలో’, నితిన్కి ‘భీష్మ’లాంటి బ్లాక్బస్టర్లు ఇచ్చి వారి కెరీర్కి పెద్ద సాయం చేశాడు వెంకీ కుడుముల.
ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్నే డైరెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. వెంకీకి ఇదో ఛాలెంజ్ అన్న టాక్ వినిపిస్తోంది. బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘జాన్’ను పాన్ ఇండియా రేంజ్లోనే తెరకెక్కిస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో యువి సంస్థతో కలిసి గోపికృష్ణ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాని బహు భాషల్లో ఎంతో ఛాలెంజింగ్గా నిర్మిస్తున్నారు.
ఇలాంటి సమయంలో వెంకీ…ప్రభాస్ని పాన్ ఇండియా లెవెల్లోనే చూపించాల్సి ఉంటుంది. ఈ స్టార్కి ఉన్న మార్కెట్ దృష్ట్యా అన్ని భాషల ప్రేక్షకులకి సరిపడే రేంజ్ స్క్రిప్ట్ను యూనివర్సల్ అప్పీల్తో రూపొందించాల్సిందే. అయితే వెంకీ ఆ ఛాలెంజ్ని తీసుకుంటాడా? అతడు తెరకెక్కించిన తొలి రెండు చిత్రాలు ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్, ఫన్ ఎలిమెంట్తో కూడుకున్న స్టోరీస్. మరి హ్యాట్రిక్ హిట్ మూవీ కోసం వెంకీ కుడుముల ఎలాంటి కథను సిద్ధం చేస్తాడు? అన్నది వేచి చూడాలి. ప్రభాస్తో మూవీ అంటే భారీ బడ్జెట్కి సంబంధించిన టాస్క్ కాబట్టి వెంకీకి ఇదో సవాల్ అనే భావించాల్సి ఉంటుంది.