Saturday, April 20, 2024

ప్రణబ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది: ఆర్మీ ఆస్పత్రి

- Advertisement -
- Advertisement -

Pranab mukherjee health condition

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆర్మీ ఆస్పత్రి పేర్కొంది. తాజాగా ప్రణబ్ ఆరోగ్యంపై ఆస్పత్రి హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆయనకు రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోందని ఆర్మీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ప్రణబ్ ముఖర్జీకి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిని నిపుణుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోన్నట్టు తెలుస్తోంది. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ నెల 10న ప్రణబ్ కు శస్త్ర చికిత్స చేశారు. అదేరోజు ఆయనకు చేసిన కరోనా పరీక్షల్లో ఆయనకు వైరస్ సోకినట్టు వెల్లడైంది. ప్రణబ్ ఆరోగ్యంపై ఆయన కుమారై షర్మిష్ఠ ట్వీట్ చేశారు. తన తండ్రి కోలుకోవాలని కాంక్షిస్తూ ఆమె భావోద్వేగ పోస్టు పెట్టారు. ”గతేడాది ఆగస్టు 8న నాన్న భారతరత్న పురస్కారం అందుకున్నారని, సరిగ్గా ఏడాది గడిచేసరికి ఆయన ఆరోగ్యం విషమించిందని ఆమె పేర్కొన్నారు. తన తండ్రి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన అందరికి కృతజ్ఞతలు” అంటూ ఆమె ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News