Saturday, April 20, 2024

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా

- Advertisement -
- Advertisement -

Pranab mukherjee tests positive for coronavirus

న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీకి కరోనా వైరస్ సోకింది. కరోనా పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ప్రణబ్ ముఖర్జీ ట్వీట్ చేశారు. ప్రత్యేక కార్యక్రమంపై తాను ఆస్పత్రికి వెళ్లానని, ఈ సందర్భంగా కరోనా టెస్టులు చేయించుకోగా తనకు వైరస్‌ సోకినట్టు తెలిందన్నారు. వారం రోజులుగా తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని ప్రణబ్ సూచించారు. ప్రణబ్‌ ముఖర్జీ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ప్రణబ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు. అటు భారత్ లో కోవిడ్ విజృంభణ పెరిగిపోతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రముఖులు కూడా కరోనా మహమ్మారి బారినపడుతుండం ఆందోళన కలిగిస్తోంది.

Pranab mukherjee tests positive for coronavirus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News