Wednesday, April 24, 2024

బాలీవుడ్ డెబ్యూ మూవీ ఓటీటీలో?

- Advertisement -
- Advertisement -

Pranita Hindi Debut Movie Bhuj

 

’ఏం పిల్లో ఏం పిల్లాడో’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన భామ ప్రణీత. బావ, పాండవులు పాండవులు తుమ్మెద, డైనమైట్, రభస, బ్రహ్మోత్సవం, హలో గురూ ప్రేమ కోసమే సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది ఈ బ్యూటీ. టాలీవుడ్‌లో మహేష్ బాబు, పవన్‌కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ లాంటి స్టార్ హీరోలతో నటించింది. పవన్ కళ్యాణ్, – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఏ ముహూర్తాన ‘అమ్మో.. బాపుగారి బొమ్మ’ అంటూ ప్రణీత కోసం పాట రాశారో గానీ అప్పటి నుంచి ఆ పేరే ఫిక్స్ అయింది ఈ అమ్మడికి. అయితే ఈ భామ తెలుగులో స్టార్ హీరోయిన్ కాలేక పోయింది. కానీ కన్నడ ఇండస్ట్రీలో మాత్రం అమ్మడు తన హవా చూపించింది. దీని గురించి ఇటీవల ప్రణీత స్పందిస్తూ కన్నడ తమిళంలో బాగా అవకాశాలు వచ్చాయని.. తెలుగులో చెప్పుకోదగ్గ పాత్రలు రాకపోడంతో ఇక్కడ ఎక్కువగా సినిమాలు చేయలేక పోయానని తెలిపింది.

కాగా ప్రణీత బాలీవుడ్‌లో కూడా అడుగు పెట్టి భుజ్, హంగామా 2 చిత్రాల్లో నటించింది. ఇదిలా ఉండగా ప్రణీత బాలీవుడ్ డెబ్యూ మూవీ అయిన ‘భుజ్‌ః- ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, సంజయ్ దత్, సోనాక్షీ సిన్హా, నోరా ఫతేహితో కలిసి ప్రణీత నటిస్తున్న ఈ సినిమా థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కాబోతోందట. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, – ఆయుష్మాన్ ఖురానా కలిసి నటించిన బాలీవుడ్ మూవీ ‘గులాబో సితాబో’ ఓటీటీలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రణీత హిందీ డెబ్యూ మూవీ ‘భుజ్’ కూడా అదే దారిలో వెళ్లబోతోందట. ఈ సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ కోసం ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ పెద్ద మొత్తాన్ని చిత్ర నిర్మాతలకు ఆఫర్ చేసిందట. దీనికి చిత్ర నిర్మాతలు కూడా అంగీకారం తెలపబోతున్నారంటూ బాలీవుడ్‌లో అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏదేమైనా ప్రణీత బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదగాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News