Friday, April 19, 2024

రోడ్డు ప్రమాదంలో గర్భిణి మృతి

- Advertisement -
- Advertisement -

Pregnant dead in Car accident at kurnool in AP

అమరావతి: రోడ్డు ప్రమాదంలో గర్భిణి మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లా అంకిరెడ్డిపల్లె సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఎర్రగుంట్లకు చెందిన శేగిరెడ్డి నరేష్ కుమార్ రెడ్డి బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. బెంగళూరులో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండడంతో సొంతూరుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు. అన్న వదినలను తీసుకరావడానికి మరిది కారులో ఎర్రగుంట్ల నుంచి ప్రయాణమయ్యాడు. అప్పటి వరకు బైక్‌లో తన భార్య పిల్లలతో కలిసి నరేష్ కర్నూలుకు వస్తున్నాడు. మార్గం మధ్యంలో తమ్ముడు కలవడంతో సోదరుడికి బైక్ ఇచ్చి తన భార్య పిల్లలతో కలిసి కారులో బయలుదేరాడు. ఇంకో 20 నిమిషాలలో ఇంటికి చేరుకుంటామన్న సంతోషంలో ఎదురుగా కంకర లోడ్‌తో వచ్చిన లారీ ఢీకొట్టడంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జుయింది. ఈ ప్రమాదంలో నరేష్ భార్య ఘటనా స్థలంలోనే తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో భార్య చనిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News