- Advertisement -
నిజామాబాద్: రెండు బైక్ లు ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తీర్మానపల్లి వద్ద మంగళవారం ఉదయం జరిగింది. ఎనిమిది నెలల గర్భంతో ఉన్న రజిత అనే మహిళ వైద్య పరీక్షల కోసం తన తమ్ముడితో కలిసి నిజామాబాద్ ఆస్పత్రికి వెళ్తోంది. ఎదురుగా వస్తున్న బైక్ రజిత ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో రజిత ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -