- Advertisement -
న్యూఢిల్లీ : కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు పలు కంపెనీలు ముందుకొస్తున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ చౌకగా వెంటిలేటర్ల ఉత్పత్తితో పాటు తాజాగా ఫేస్షీల్డ్ల తయారీకి సిద్ధమవుతోంది. సోమవారం(మార్చి 30) నుంచి మహీంద్రా ఫేస్ షీల్డ్ల తయారీని ప్రారంభించనున్నట్టు సంస్థ ఎండి పవన్ గోయెంకా తెలిపారు. రోజుకు 500 యూ నిట్లు ఉత్పత్తి చేస్తామని, ఆ తర్వాత వీటిని మరింత వేగవంతం చేస్తామని ఆయన ప్రకటించారు. సంస్థ భాగస్వామి ఫోర్డ్ మోటార్ నుంచి డిజైన్ తీసుకున్నామని, ఫేస్షీల్డ్లను తయారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, 500 యూనిట్లు తయారీతో ఉత్పత్తిని ప్రారంభిస్తామని వెల్లడించారు.
Preparation of Mahindra Faceshield for Corona Control
- Advertisement -