హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ రామ్నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. తెలుగు సంస్కృతి, చరిత్ర, సాహిత్యానికి దేశం గర్వపడుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజల సేవలు దేశానికి ఎంతో కీలకమన్నారు. భవిష్యత్తులో తెలంగాణ మరింత అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి.
President Kovind Greetings To Telangana People
తెలంగాణ రాష్ట్ర సోదర సోదరీమణులకు నమస్కారం!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం.
— President of India (@rashtrapatibhvn) June 2, 2020