Tuesday, April 23, 2024

తెలంగాణకు రాష్ట్రపతి ముర్ము.. ఘన స్వాగతం పలకనున్న సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు(సోమవారం) తెలంగాణకు రానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హకీంపట ఎయిర్ పోర్టులో రాష్ట్రపతి ముర్ముకు ఘన స్వాగతం పలకనున్నారు. సిఎం కెసిఆర్ తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణకు వచ్చిన అనంతరం రాష్ట్రపతి శ్రీశైలంకు వెళ్లనున్నారు. రాష్ట్రపతి ముర్ము రాకతో రేపు శ్రీశైలం పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. దోమలపెంట, శిఖరం చెక్ పోస్టు దగ్గర వాహనాలు నిలిపివేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News