Friday, April 19, 2024

దేవుడు ఆదేశించాడు.. కరోనా అంతానికి వ్యక్తిని బలిచ్చిన పూజారి

- Advertisement -
- Advertisement -

 

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దానిని అంతం చేయాలని భావించిన ఓ వృద్ధ పూజారి దారుణానికి పాల్పడ్డాడు. నర బలితో దేవుడిని సంతృప్తి పరిస్తే కరోనా వైరస్ అంతమవుతుందని వృద్ధ పూజారి ఓ వ్యక్తి తల నరికిన సంఘటన ఒడిశా కటక్‌లో నరసింగ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంధహూడ సమీపంలోని ఆలయంలో బుధవారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో మృతిచెందిన వ్యక్తిని సరోజ్‌ కుమార్ ప్రధాన్(52)గా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. బంధా మా బుద్ధ బ్రాహ్మణి దేవాలయంలో పూజలు నిర్వహించే పూజారి సంసారీ ఓజా(72), సరోజ్‌ కుమార్ లకు మధ్య నర బలిపై గొడవ జరిగింది. మాటామాట పెరిగి గొడువ పెద్దది కావడంతో పూజారి పదునైన ఆయుధంతో సరోజ్‌ కుమార్ తలను నరికాడు. దీంతో సరోజ్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

అనంతరం నిందితుడు పూజారి నరికిన తలను ఓ గిన్నెలో పెట్టి పోలీసులకు లొంగిపోయాడు. వెంటనే పోలీసులు సదరు పూజారిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు పూజారిని విచారించగా.. కరోనా వైరస్ అంతమవ్వాలంటే నర బలి జరగాలని తనకు కలలో దేవుడు ఆదేశించాడని పూజారి చెప్పుకొచ్చాడు. దీంతో కంగుతిన్న పోలీసులు నిందితుడిని రిమాండ్ కు తరలించారు.

Priest chops off man head inside temple to ward off corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News