Saturday, April 20, 2024

కరోనా వైరస్ సోకి అర్చకుడు మృతి

- Advertisement -
- Advertisement -

 

రాజన్న సిరిసిల్ల: కరోనా వైరస్ సోకడంతో అర్చకుడు మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేముల వాడ మున్సిపల్ పరిధిలో జరిగింది. రాజన్న అనుబంధ ఆలయమైన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో దామోదర్(41) అనే అర్చకుడు పని చేస్తున్నాడు. దామోదర్‌కు వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఆయన పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News