- Advertisement -
వరదలపై నీ రిపోర్టింగ్ చూసి చలించిపోయా
టివి జర్నలిస్టుకు ప్రధాని మోడీ ప్రశంసలు
న్యూఢిల్లీ : ఇటీవల ఎంఫాన్ తుపాను సృష్టించిన విలయం లోనూ ప్రాణాలకు తెగించి రిపోర్టింగ్ చేసిన కోల్కతా టీవీ జర్నలిస్ట్ సుచంద్రిమ పాల్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశసిం చారు. ఆమెకు ఫోన్ చేసి మరీ అభినందించారు. కోల్కతా టివిలో సుచంద్రిమ ఇచ్చిన గ్రౌండ్ రిపోర్ట్ చూసి తాను చలించి పోయానని, వెంటనే బాధిత ప్రాంతాలను సంద ర్శించానని వెల్లడించారు. తక్షణమే పశ్చిమ బెంగాల్కు రూ.1000 కోట్లు సాయం విడుదల చేసానని, వీటన్నిటికీ కారణం సుచంద్రిమ రిపోర్ట్ తన మనసులో బలమైన ముద్ర వేసిందని ప్రధాని అభినందించారు.
- Advertisement -