హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రధానికి ఐదుగురు అధికారులు స్వాగతం పలికారు. హకీంపేట ఎయిర్ పోర్టు నుంచి నుంచి రోడ్డు మార్గం ద్వారా జినోమ్ వ్యాలీకి వెళ్లి భారత్ బయోటెక్ ను సందర్శించనున్నారు. మధ్యాహ్నం 1.25 గంటలకు భారత్ బయోటెక్ కు ప్రధాని చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1.25 నుంచి 2.10 గంటల వరకు భారత్ బయోటెక్ లో సందర్శిస్తారు. అక్కడ శాస్త్రవేత్తలతో మాట్లాడి కొవాగ్జిన్ పురుగతిని తెలుసుకోనున్నారు. భారత్ బయోటెక్ ‘కొవాగ్జిన్’ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 2.15గంటలకు భారత్ బయోటెక్ నుంచి హకీంపేట ఎయిర్ పోర్టుకు తిరుగు పయనం కానున్నారు. మధ్యాహ్నం 2.40గంటలకు హకీంపేట విమానాశ్రయం చేరుకుంటారు. మ.3.50 గం.లకు హకీంపేట నుంచి పుణె బయలుదేరనున్నారు ప్రధాని మోడీ. మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ నేడు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అహ్మదాబాద్ లో బైడన్ బయోటెక్ పార్కును ప్రధాని సందర్శించారు.
హైదరాబాద్ కు చేరుకున్న ప్రధాని మోడీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -