Friday, April 19, 2024

భారత్ బయోటెక్ ను సందర్శించిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

Prime Minister Modi visits Bharat Biotech

హైదరాబాద్: జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ ను ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు. భారత్ బయోటెక్ రూపొందిస్తున్న ‘కొవాగ్జిన్’ తయారీని ప్రధాని మోడీ పరిశీలించారు. శాస్త్రవేత్తలతో మాట్లాడి కొవాగ్జిన్ వ్యాక్సిన్ పురోగతిపై శాస్త్రవేత్తలతో ప్రధాని చర్చించారు. ప్రస్తుతం కొవాగ్జిన్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న విషయాన్ని వారు మోడీకి వివరించారు. అనంతరం ప్రధాని మోడీ భారత్ బయోటెక్ నుంచి హకీంపేట ఎయిర్ పోర్టుకు బయల్దేరారు. హకీంపేట నుంచి ఆయన పుణెకు వెళ్లనున్నారు. కరోనా టీకా అభివృద్ధి సమీక్ష కోసం ప్రధాని 3 నగరాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

Prime Minister Modi visits Bharat Biotech

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News