- Advertisement -
సూర్యాపేట: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన సంఘటన సూర్యాపేటలో జరిగింది. లీలాదరి ప్రైవేటు ట్రావెల్స్ చెందిన బస్సు రాజస్థాన్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా సూర్యాపేటకు సమీపంలో డివైడర్ను ఢీకొట్టిన అనంతరం ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. రెండు కరెంట్ స్తంభాల మధ్య నుంచి బస్సు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 36 మంది ప్రయణీకులు ఉన్నారు.
- Advertisement -