Friday, April 19, 2024

కొత్తూరు శివారులో ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Private employee commits suicide in Kothur

కొత్తూరు: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల శివారులో ఓ ప్రైవేట్ ఉద్యోగి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. నాట్కో ఫార్మా కంపెనీ వద్ద ప్రైవేట్ వెంచర్ లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు మృతుడు (కార్తీక్) సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. కార్తీక్ హైదరాబాద్ లో ఎల్జీ కంపెనీలో ఫీల్డ్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. కార్తీక్ ప్రస్తుతం నగరంలోని బాలాపూర్ లో నివాసం ఉంటున్నాడు. అతని స్వస్థలం వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం అమ్మాపురంగా పోలీసులు గుర్తించాడు. ఆత్మహత్యకు ముందు కార్తీక్ వాట్సాప్ లో లోకేషన్ షేర్ చేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్ నగర్ ప్రభుత్వాస్రత్రికి తరలించారు. అసలు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడో అనే విషయాలు ఇంకా తెలియాల్సిఉన్నాయి.

Private employee commits suicide in Kothur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News