- Advertisement -
అమరావతి: విశాఖలో ఎనిమిది మందిని పెళ్లి చేసుకుని వేధిస్తున్న అరుణ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలని బాధిత మహిళలు డిమాండ్ చేస్తున్నారు. వ్యభిచారం చేయాలంటూ అరుణ్ తమపై ఒత్తిడి చేస్తున్నాడని బాధితులు ఆరోపించారు. ఈ విషయంపై గత నేలలోనే కంచరపాలెం పోలీసులను ఆశ్రయించామని తెలిపారు. అరుణ్ కుమార్ నుంచి తమకు ప్రాణహాని ఉందని, సిపికి వాయిస్ మెసేజ్ పెట్టినట్టు చెప్పారు. తాను పోలీసుల్ ఇన్ ఫార్మర్ కావడంతోనే పోలీసులు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బాధితులు మహిళా సంఘాలను ఆశ్రయించారు.
- Advertisement -