Friday, April 26, 2024

ఇద్దరు సీనియర్ ఐపిఎస్‌లకు డిజిలుగా పదోన్నతి

- Advertisement -
- Advertisement -

Promotion of two senior IPS officers to DG Rank

హైదరాబాద్‌ః రాష్ట్రంలో సీనియర్ ఐపిఎస్ అధికారులు గోపీకృష్ణ, పూర్ణచందర్రావులకు డిజిలుగా ప్రమోషన్ కల్పిస్తూ మంగళవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్‌పిఎఫ్) డిజిగా ఉన్న గోపీకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగించింది. డిజిపి హోదాలో ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్‌గా ఎం గోపీకృష్ణ నియామకం అయ్యారు. అలాగే అవినీతి నిరోధక శాఖ డైరెనక్టర్ జనరల్ గా జె. పూర్ణచందర్ రావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డిజిగా పూర్ణచందర్ రావుకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Promotion of two senior IPS officers to DG Rank

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News