- Advertisement -
హాజీపూర్: తెలంగాణలో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరస హత్యల కేసులో గురువారం తీర్పు వెలువడింది. ఈ కేసులో 101 మంది సాక్షులను విచారించిన నల్గొండ ఫోక్సోకోర్టు నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించింది. ముగ్గురు బాలికలను కిరాతకంగా అత్యాచారం, హత్యచేసి బావిలో పూడ్చిపెట్టాడు. మూడు నెలల పాటు ప్రత్యేక కోర్టు ఈ కేసును విచారించింది. మూడు కేసుల్లో శ్రీనివాస్ రెడ్డికి మరణ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుతో హాజీపూర్ గ్రామస్థులతో పాటు, బాధిత కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సమత కేసులో కూడా ముగ్గురు దోషులకు ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇటీవల మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
Psycho killer Srinivas Reddy sentenced to death
- Advertisement -