Thursday, April 25, 2024

ఎంపిగా మారిన పరుగుల రాణి..

- Advertisement -
- Advertisement -

PT Usha met Prime Minister Narendra Modi

సంతోషంగా ఉందంటూ మోడీ ట్వీట్

మన తెలంగాణ/హైదరాబాద్ : భారత పరుగుల రాణి పిటి ఉష రాజ్యసభ సభ్యురాలిగా మారిపోయారు. ఇటీవలే దక్షిణాదికి చెందిన నలుగురు ప్రముఖులు రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎన్నికైన సంగతి, వీరిలో పిటి ఉష కూడా ఉన్న విషయం విదితమే. కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన వారిలో పలువురు సోమవారమే ప్రమాణ స్వీకారం చేయగా పిటి ఉష బుధవారం రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు. తాజాగా బుధవారం పార్లమెంటులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని పిటి ఉష కలిశారు. ఈ సందర్భంగా ఆమెతో ఉన్న ఫోటోను మోడీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పార్లమెంటులో పిటి ఉషను చూడటం సంతోషంగా ఉందంటూ మోడీ తన ట్వీట్‌కు ఓ కామెంట్ జత చేశారు. ఇదిలా ఉంటే రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేస్తున్న వీడియోను పిటి ఉష సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News