ఛండీఘర్:దేశవ్యాప్తంగా కరోనా వైరస్(కోవిడ్-19) మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ గడవు మే 3తో ముగియనుంది. పంజాబ్ లో కరోనాను పూర్తిగా అరికట్టేందుకు మార్చి 25వరకు మరో రెండు వారాలు లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. ఉదయం 7 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు లాక్ డౌన్ సడలింపులకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 342 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 101 మంది కరోనా బారీ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక, కరోనాతో ఇప్పటివరకు 19మంది ప్రాణాలు కోల్పోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 222 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Punjab CM Announces Extended Lockdown Next 2 Weeks