- Advertisement -
ఛండీఘర్: మహమ్మారి కరోనా వైరస్ ను ఆరికట్టేందుకు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు శుక్రవారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో లాక్ డౌన్ ను మే 1వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఒడిశా ప్రభుత్వం కరోనా నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు లాక్ డౌన్ ఒక్కటే మార్గమని, లాక్ డౌన్ ను ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించింది. మార్చి 24న ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 14 వరకు 21 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, లాక్ డౌన్ గడువు దగ్గరపడుతున్న ఇంకా కరోనా తగ్గకపోవడంతో అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా లాక్ డౌన్ ను పొడిగించనున్నట్లు తెలుస్తోంది.
Punjab Govt Extends Covid 19 Lockdown Till May 1
- Advertisement -