Saturday, April 20, 2024

భారతీయులపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

మాస్కో : రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి భారత దేశంపై ప్రశంసల జల్లు కురిపించారు. భారతీయులు ప్రతిభావంతులని, అభివృద్ధిలో అద్భుత ఫలితాలను సాధించేందుకు అవసరమైన గొప్ప సమర్ధత , విజయకాంక్ష కలవారని అన్నారు. నవంబరు 4 న రష్యన్ యూనిటీ డే సందర్భంగా ఆయన ప్రసంగించారు. 100 కోట్లకు పైబడిన జనాభా గల భారత దేశ సత్తా పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సుదీర్ఘ కాలం నుంచి సత్సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. “మనం భారత దేశాన్ని చూద్దాం. అంతర్గత అభివృద్ధి కోసం విజయ కాంక్షగల గొప్ప ప్రతిభావంతులు అక్కడ ఉన్నారు. ఆ దేశాభివృద్ధిలో కచ్చితంగా అద్భుత ఫలితాలు వస్తాయి. సందేహాలేవీ అక్కర్లేదు. దాదాపు 150 కోట్ల మంది ప్రజానీకం ఉన్నారు. ఇప్పుడు అదే సత్తా ” అని పుతిన్ చెప్పారు. గతవారం కూడా పుతిన్ భారత దేశ విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా భారత్ పాత్ర పెరుగుతుందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News