Wednesday, April 24, 2024

ఫైనల్‌లో పివి సింధు ఓటమి..

- Advertisement -
- Advertisement -

బాలి: ప్రతిష్ఠాత్మకమైన బిడబ్లూఎఫ్ వరల్డ్ టూర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ ఫైనల్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పి.వి.సింధు ఓటమిపాలైంది. ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ ఫైనల్‌లో దక్షిణ కొరియాకు చెందిన 19 ఏళ్ల షట్లర్ ఆన్‌ సెయాంగ్‌ చేతిలో సింధు పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో సింధుపై 16-21, 12-21తేడాతో సెయాంగ్ గెలుపొందింది. దీంతో సిల్వర్‌ మెడల్‌తో సింధు టోర్నీని ముగించింది. కాగా, శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి, జపాన్ షట్లర్ యమగూచిని ఓడించి ఫైనల్ కు చేరుకున్న సింధుకు నిరాశే మిగిలింది.

PV Sindhu loses BWF World Tour Final

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News