Thursday, April 25, 2024

సింధుకు మరో అరుదైన గౌరవం

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పి.వి.సింధు మరో ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ప్రముఖ స్పోర్ట్ ఛానల్ ఈఎస్‌పిఎన్ ఈ ఏటి మేటి క్రీడాకారిణిగా సింధు నిలిచింది. సింధు ఈఎస్‌పిఎన్ అత్యుత్తమ క్రీడాకారిణిగా నిలువడం ఇది మూడోసారి కావడం విశేషం. మరోవైపు యువ షూటర్ సౌరభ్ చౌదరి కూడా ఈఎస్‌పిఎన్ ఉత్తమ క్రీడాకారుడిగా నిలిచాడు. అంతర్జాతీయ షూటింగ్‌లో సౌరభ్ కనబరుస్తున్న ప్రతిభకు గుర్తింపుగా ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. 2019 సంవత్సరానికి గాను ఈఎస్‌పిఎన్ సంస్థ ఈ పురస్కారాలను ప్రకటించింది. కాగా, దీని కోసం నిర్వహించిన ఓటింగ్‌లో సౌరభ్, సింధులు అగ్రస్థానంలో నిలిచారు. కిందటి ఏడాది సింధు ప్రపంచకప్ బ్యాడ్మింటన్‌లో స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. దీంతో సింధుకు ఈసారి కూడా అత్యుత్తమ క్రీడాకారిణిగా నిలిచింది.

PV Sindhu wins Female ESPN SportsPerson 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News