Friday, March 29, 2024

మణికొండలో 14 అడుగుల కొండచిలువ…

- Advertisement -
- Advertisement -

మణికొండ: రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పంచవటి కాలనీలో 14 అడుగుల కొండ చిలువ కలకలం సృష్టించింది. కొండచిలువను చూసి స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. బుల్కాపూర్ నాలా వాకింగ్ ట్రాక్‌పై 14 అడుగుల కొండచిలువ తిరుగుతుండడం గమనించిన వాకర్లు స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇచ్చారు. స్నేక్ సొసైటీ సభ్యులు చాకచక్యంగా వ్యవహరించి కొండ చిలువను పట్టుకొని సంచిలో బంధించారు. కొండ చిలువను అడవిలో వదిలిపెడుతామని తెలిపారు. కొండచిలువ దొరకడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News