- Advertisement -
అమరావతి: మత్స్యకారుల వలకు కొండచిలువ చిక్కిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలో జరిగింది. మత్స్యకారులు చేపల వేట కోసమని సిద్ధాపురం చెరువులోకి వెళ్లారు. చేపలు పడుతున్నప్పుడు వలలో కొండచిలువ చిక్కుకున్నట్టు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు కొండ చిలువను వలలో నుంచి బయటకు తీసి నల్లమల అడవిలో వదిలిపెట్టారు.
- Advertisement -