- Advertisement -
నాణ్యతలో ఏమాత్రం రాజీ వద్దు
ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్
మనతెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిధి: వైకుంఠదామం నిర్మాణ పనుల్లో ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు తగ్గినా సహించేదే లేదని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ తెలిపారు. మంగళవారం పట్టణంలో 24వ వార్డు పరిధిలోని యాదవనగర్లో కోటి రూపాయలతో నిర్మిస్తున్న వైకుంఠదామ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ త్వరితగతిన నిర్మాణ పనులును పూర్తి చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, వార్డు కౌన్సిలర్ మార్నేని వెంకన్న, నాయకులు గద్దె రవి, యాళ్ల మురళీధర్రెడ్డి, డౌలాగర్ శంకర్, మార్నేని కిరణ్, బోగా రవిచంద్ర, మున్సిపల్ అధికారులు ఉన్నారు.
- Advertisement -