Friday, March 29, 2024

పేదల ఆకలి తీరుస్తున్న రాశీ

- Advertisement -
- Advertisement -

Raasi Khanna

కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక అనేకమంది ఆకలితో అలమటిస్తున్నారు. ఒకవైపు వైరస్ భయపెడుతుంటే మరోవైపు ఆకలి బాధలు వేధిస్తున్నాయి. అందుకే పలువురు ప్రముఖులు స్వచ్ఛ ంద సంస్థలతో కలిసి పేదల ఆకలి బాధ లు తీర్చడానికి ముందుకొస్తున్నారు. తాజాగా హీరోయిన్ రాశీఖన్నా ‘రోటీ బ్యాంక్’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆకలితో ఉన్నవారికి ఆపన్న హస్తం అందిస్తోంది. నిజానికి రాశీఖన్నా చాలా రోజుల నుండి ‘బీ ద మిరాకిల్’ పేరుతో ఈ సేవా కార్యక్రమం చేస్తున్నా కూడ ఈమధ్యనే ఈ విషయాన్ని బయటపెట్టింది.

కేవలం తను మాత్రమే చేస్తే కొద్దిమందికే సహాయం అందుతుందని… అదే అనేకమంది కలిస్తే ఇంకా ఎక్కువమంది ఆకలి తీర్చవచ్చనే ఉదేశ్యంతో ఇతరులను ప్రోత్సహించడానికి తాను చేస్తున్న సేవా కార్యక్రమాన్ని గురించి సోషల్ మీడియా ద్వారా అందరికీ వివరించి విరాళాలు కోరుతోంది. ఒక్క 40 రూపాయలు విరాళం గా ఇస్తే ఒక పూట ఒకరి ఆకలి తీర్చినవారమవుతామంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఆమె పిలుపుతో అనేకమంది విరాళా లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ డబ్బుతో హైదరాబాద్‌లో ప్రతిరోజూ సు మారు 1200 మంది ఆకలి ని తీరుస్తోంది రాశీ. ఈ కా ర్యక్రమాన్ని ఇంకా ఉధృతం గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉంది ఈ అందాల తార.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News