Saturday, April 20, 2024

ఆ కోరిక తీరింది

- Advertisement -
- Advertisement -

Radhe Shyam is matured love story Says Pooja Hegde

ప్రస్తుతం కెరీర్‌లో పీక్ స్టేజ్‌ను ఎంజాయ్ చేస్తోంది హీరోయిన్ పూజా హెగ్డే. క్యారెక్టర్స్, కథలతో సంబంధం లేకుండా బిగ్ బ్యానర్లు, బిగ్ స్టార్స్‌తో సినిమాలు చేస్తోంది. అయితే ఎన్నో క్యారెక్టర్స్ చేస్తున్న తనకు ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ పడలేదనే బాధ ఉండేదని, ‘రాధేశ్యామ్’ సినిమాతో ఆ కోరిక కూడా తీరిందని చెబుతోంది పూజ. “ఇదొక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ. చాలా యాక్షన్ సినిమాలు చేసిన ప్రభాస్ నుంచి లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న రొమాంటిక్ మూవీ ఇది. ఇక నా విషయానికొస్తే.. నేను చాన్నాళ్లుగా ఓ మంచి లవ్ స్టోరీ చేయలేదు. ఈమధ్య కాలంలో నేను చేసిన ఫుల్ లెంగ్త్ ప్రేమకథ ఇదే. అందుకే చాలా ఆనందంగా ఉంది”అని ఈ స్టార్ బ్యూటీ పేర్కొంది. ఇక ప్రభాస్, -పూజా కాంబోలో వస్తున్న ఫస్ట్ మూవీ ఇది.

పూజా హెగ్డే చెబుతున్న ప్రకారం.. రాధేశ్యామ్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరో వారం రోజులు లేదా 10 రోజుల్లో టోటల్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకున్న తర్వాత నిర్మాతలు రిలీజ్ డేట్ పై ప్రకటన చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News