ప్రభాస్ నటిస్తున్న రొమాంటిక్ పిరియాడిక్ ఫిక్షనల్ లవ్స్టోరీ ‘రాధేశ్యామ్’. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ షూటింగ్ చేస్తున్నారు. అయితే అన్లాక్ ప్రక్రియ లో భాగంగా మార్గదర్శకాలని పాటిస్తూ సెట్స్లో షూటింగ్స్ చేస్తున్నామని సామాజిక దూరం, మాస్క్లు ధరించడం… ఆలింగనాలకు దూరంగా షూట్ చేస్తున్నామని పూజాహెగ్డే చెప్పింది. కెమెరా ముందుకు రాగానే మాస్క్లు తొలగించి షూటింగ్లో పాల్గొంటున్నామని ఈ బ్యూటీ చెబుతోంది. పూజా హెగ్డే తన పుట్టిన రోజుని ఇటీవల ఇటలీలో యూనిట్ సభ్యుల మధ్య జరుపుకుంది. ఇదే రోజు పూజా హెగ్డే ఓ ఎమోషనల్ సీన్ లో నటించిందట. తాజా సమాచారం ప్రకారం ఇటలీలో కీలక ఘట్టాలని పూర్తి చేసి బ్యాలెన్స్డ్గా ఉన్న షూట్ని హైదరాబాద్లో పూర్తి చేయబోతున్నారట. అయితే ఈ చిత్రంలో తాను డబుల్ రోల్ చేయడం లేదని పూజా హెగ్డే స్పష్టం చేసింది. అంతే కాకుండా తనది పౌరాణికి పాత్ర కూడా కాదని వెల్లడించింది. ద్విపాత్రాభినయం కాకపోయినా పూజా హెగ్డే లుక్వైజ్ వేరియేషన్స్ ఆద్యంతం మైమరిపిస్తాయట.
Radhe Shyam Movie Pooja not Act Dual Role