Saturday, April 20, 2024

రాధిక, శరత్ కుమార్ దంపతులకు ఏడాది జైలు శిక్ష..

- Advertisement -
- Advertisement -

Radhika and Sarathkumar gets one year jail

చెన్నై: కోలీవుడ్ సెలబ్రెటీ జంట రాధిక, శరత్ కుమార్ లకు ఏడాది జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో బుధవారం చెన్నై స్పెషల్ కోర్టు రాధిక దంపతులకు ఈ శిక్ష విధించింది. గతంలో రాధిక, శరత్ కుమార్ దంపతులు కోలీవుడ్ లో కొన్ని సినిమాలను నిర్మించారు. ఇందుకోసం ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి డబ్బును అప్పుగా తీసుకున్నారు. తిరిగి అప్పు చెల్లించేందుకు సదరు సంస్థకు చెక్ అందించారు. అయితే, చెక్ బౌన్స్ కావడంతో ఆ సంస్థ కోర్టులో కేసు వేసింది. తాజాగా ఈ కేసును విచారించిన చెన్నై ప్రత్యేయ న్యాయస్థానం రాధిక, శరత్ కుమార్ దంపతులకు ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.

Radhika and Sarathkumar gets one year jail

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News