- Advertisement -
బెంగళూరు: రాఘవేంద్ర కో ఆపరేటివ్ బ్యాంక్ మాజీ సిఇఒ వాసుదేవ మాయి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని పూర్ణప్రజ్ఞలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఇంటికి యాబై మీటర్ల దూరంలో కారులో విషం తాగి వాసుదేవ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. వారం రోజుల నుంచి వాసుదేవపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన ఇంటిపై ఎసిబి వాళ్లు దాడులు చేశారు. రాఘవేంద్ర కో ఆపరేటివ్ బ్యాంక్లో జరిగిన రూ. 1400 కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. బ్యాంక్ నుంచి 1400 కోట్ల రూపాయాలను వివిధ ఆకౌంట్లకు మళ్లించినట్టు వాసుదేవపై ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్లో ఎ1 నిందితుడిగా వాసుదేవ ఉండడంతో ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -