- Advertisement -
కనిష్ట ప్రభుత్వం, గరిష్ట ప్రైవేటైజేషన్
న్యూఢిల్లీ: కనిష్ట ప్రభుత్వం, గరిష్ట ప్రైవేటైజేషన్ ప్రధాని మోడీ ఆలోచనా విధానమని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ విమర్శించారు. నూతన ఉద్యోగ నియామకాలపై కేంద్రం ఆంక్షలు విధించినట్టు వచ్చిన మీడియా కథనాలను తన ట్విట్కు జత చేస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. యువకుల భవిష్యత్ను కాలరాస్తూ తన స్నేహితుల అభ్యున్నతి కోసం ప్రధాని పాటుపడుతున్నారని రాహుల్ విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో శాశ్వత ఉద్యోగాలు లేకుండా చేయాలన్నదే ఆయన ఉద్దేశమని రాహుల్ ఆరోపించారు. కరోనాను అందుకు సాకుగా చూపుతున్నారని దుయ్యబట్టారు.
Rahul Gandhi attacks PM Modi government
- Advertisement -