Friday, March 29, 2024

మాజీ కేంద్ర మంత్రి పాడె మోసిన రాహుల్

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi pay tributes to Satish Sharma

న్యూఢిల్లీ: ప్రముఖ నేత, మాజీ కేంద్ర మంత్రి కెప్టెన్ సతీష్ శర్మకు కాంగ్రెస్ పార్టీ నివాళి అర్పించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సతీష్ శర్మ పాడె మోశారు. గోవాలో బుధవారం కెప్టెన్ సతీశ్ శర్మ తుదిశ్వాస విడిచారు. అయన వయసు 73 ఏళ్ళు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ తోటి నాయకులతో కలిసి పాడె మోశారు. కెప్టెన్ శర్మ 1993 నుండి 1996 వరకు పి.వి నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేశారు. మూడు సార్లు లోక్ సభ ఎంపిగా, మూడు సార్లు రాజ్యసభ ఎంపిగా ఎన్నికయ్యారు. అతను మొదట జూన్ 1986లో రాజ్యసభ సభ్యుడయ్యాడు. తరువాత రాజీవ్ గాంధీ మరణం తరువాత 1991 లో అమేథి నుండి లోక్ సభకు ఎన్నికయ్యాడు. ఆయన మృతదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News