Friday, April 19, 2024

రైతుల హత్యలు, ధరల పెరుగుదలపై ప్రధాని మౌనం దాల్చారు: రాహుల్‌గాంధీ

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi slams Prime Minister Narendra Modi

న్యూఢిల్లీ: రైతులు, బిజెపి కార్యకర్తల హత్యలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం,ఇంధనం ధరల పెరుగుదలలాంటి సమస్యలపై ప్రధాని మోడీ మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. తనను, తన స్నేహితుల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం ప్రధాని హింసాత్మకంగా స్పందిస్తారని రాహుల్ ఓ ట్విట్‌లో పేర్కొన్నారు. యుపిలోని లఖీంపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటన నేపథ్యంలో రాహుల్ ఈ ట్విట్ చేశారు. ఆర్మీచీఫ్ జనరల్ ఎంఎం నరవణె ఇటీవల చేసిన వ్యాఖ్యలపైనా రాహుల్ ప్రశ్నలు సంధించారు. చైనా సైన్యం ఎల్‌ఎసిలోని చైనా సైడ్‌లో పెద్ద ఎత్తున మౌలిక వసతుల్ని నిర్మిస్తున్నదని నరవణె ఇటీవల ఓ మీడియాకిచ్చిన ఇంటర్వూలో తెలిపారు. చైనా సైన్యం అక్కడ కొనసాగాలని చూస్తోందని నరవణె అన్నారు. వాళ్లు అక్కడ కొనసాగితే, మనం కూడా అక్కడే కొనసాగుతామని నరవణె అన్నారు. చైనా కొనసాగుతోంది ఎక్కడ..? మన భూభాగంలోనా..? అని రాహుల్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News