Thursday, April 25, 2024

గోషామహల్‌లో వైద్యసేవల కోసం ప్రత్యేక వాహనాలు

- Advertisement -
- Advertisement -

MLA Raja singh

 

మన తెలంగాణ/గోషామహల్: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంతో భాగంగా రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో గోషామహల్ నియోజకవర్గంలోని పరిధిలోని ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే తన దృష్టికి తీసుకువస్తే సత్వర వైద్యసేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లాక్‌డౌన్ నేపథ్యంలో రవాణా సౌకర్యం లేనందున అనారోగ్యంతో బాధపడుతున్న స్థానిక ప్రజల రవాణా సౌకర్యార్దం మూడు కార్లను అందుబాటులో ఉంచామని, తనకు ఫోన్ చేసిన 10 నిమిషాల్లో వారి ఇ ంటికి కారును పంపించి ఆసుపత్రిలో చేర్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. లాక్‌డౌన్ తొలగించేవరకు నేటి నుండి ప్రతి రోజూ వెయ్యి మందికి భోజన సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు.

 

Raja singh special vehicles set up for medical services
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News