Tuesday, April 23, 2024

రాజయోగి దాది జానకి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Raja Yogi dadi

 

గవర్నర్ డాక్టర్ తమిళిసై సంతాపం

మనతెలంగాణ / హైదరాబాద్ : బ్రహ్మకుమారీల ఆధ్యాత్మిక గురువుగా పేర్కొందిన రాజయోగి దాది జానకి మృతిపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరాజన్ ఓ ప్రకటనలో సంతాపం తెలియచేశారు. రాజస్థాన్ మౌంట్ అబూలోని గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దాది జానకి శుక్రవారం వేకువజామున 2.10 నిమిషాల సమయంలో కన్నుమూశారు. ఈ విషయం తెలిసి తాను చాలా బాధపడ్డానని గవర్నర్ పేర్కొన్నారు. దాది జానకి లక్షలాది మందికి సానుకూల జీవితాన్ని గడపడానికి, శాంతి సందేశాన్ని వ్యాప్తి చేయడానికి సహాయపడిందని గవర్నర్ కొనియాడారు. భారతీయ రాజయోగ కీర్తిని 140 దేశాలకు ఆమె విస్తరించిందన్నారు. 83 సంవత్సరాల ఆధ్యాత్మిక జీవితం, ధ్యానం, నిస్వార్థ సేవతో ఆమె ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజల హృదయాలను తాకిందని గవర్నర్ కొనియాడారు. గవర్నర్ ఈ సందర్భంగా ఆమె నివాళ్లు తెలియచేశారు.

 

Raja Yogi dadi Janaki passes away
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News