Thursday, April 25, 2024

రాజగోపాల్ రెడ్డికి పిచ్చి ముదిరింది…

- Advertisement -
- Advertisement -

Rajagopal reddy is mad fellow

నల్గొండ: కాంగ్రెస్ ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కెఎ పాల్ లాగా మారిపోయారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం చండూరులో ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి కి పిచ్చి ముదిరడంతో జోకర్ లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.   ఎం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడంలేదని,  మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ అవుతుంటే రాజగోపాల్ రెడ్డి కి దిమ్మ తిరుగుతుందన్నారు. ఆయన మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు గడప కూడా దాటడంలేదని ఎద్దేవా చేశారు.  వెల్మకన్నే ఫీడర్ ఛానెల్ ను పూర్తి చేస్తా అని హామీ ఇచ్చి మర్చిపోయారని,  టిఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ అంటూ కోమటిరెడ్డిని ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. అడ్డగోలుగా మాట్లాడుతే ఊరుకునేది లేదని,  మునుగోడు లో తన అనుచరులను కాపాడుకోలేని రాజగోపాల్ రెడ్డి సూర్యాపేటకి పోయి రాజకీయాలు చేస్తా అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డిని దొంగ లాగా చూస్తున్నారని,  అబద్ధాలు చెప్పడంలో ఎంఎల్ఎగా రాజగోపాల్ రెడ్డి చరిత్రకెక్కాడని చురకలంటించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ నాయకత్వంలో మునుగోడును అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News